హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో తెలంగాణ ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) అధికారులను రాష్ట్ర అధికారులు కోరారు. లింక్ ప్రాజెక్టు ద్వారా తరలించుకుపోయే 148 టీఎంసీల్లో 74 టీఎంసీలను తెలంగాణకే కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఎన్డబ్ల్యూడీఏ చీఫ్ ఇంజినీర్ దేవేందర్ నేతృత్వంలో అధికార బృందం జలసౌధకు గురువారం విచ్చేసింది. తెలంగాణ అంతర్రాష్ట్ర జలమండలి సీఈ మోహన్కుమార్, ఈఎన్సీ నాగేందర్రావు, గోదావరి బేసి న్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యప్రసాద్ తదితరులతో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ గతంలోనే అనేక అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో వాటిపై చర్చించింది.