జోగులాంబ గద్వాల : పేదింటి ఆడపడుచులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం గద్వాల మండల పరిధిలోని అనంతపురం, బస్రా చెరువు, బీరోలు లక్ష్మీపురం, పూడూరు వీరాపురం, ములకలపల్లి గ్రామాల్లో లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..తల్లిదండ్రులు ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే ప్రస్తుతం ఇబ్బందులకు గురవుతున్నారు.
అలాంటి సమయంలో వారికి చేయూతనిచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడబిడ్డల పెళ్లిళ్లు చేయడానికి ప్రభుత్వం కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ పథకాలతో చేయూత ఇస్తుందన్నారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో తాసిల్దార్ లక్ష్మి , ఎంపీపీ ప్రతాప్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, జడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ తదితరులు పాల్గొన్నారు.