హైదరాబాద్, ఆట ప్రతినిధి: హెచ్పీఆర్సీ ఈక్వెస్ట్రియన్ చాలెంజ్ రెండో సీజన్లో హితేష్ రెడ్డి, కుంభం సాయి తన్వి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. గండిపేట్లోని హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ ప్రాంగణంలో శనివారం జరిగిన జరిగిన డ్రెస్సేజ్ చిల్డ్రన్ విభాగంలో సెంటార్ గుర్రంపై స్వారీ చేసిన హితేష్ రెడ్డి అగ్రస్థానంతో విజేతగా నిలిచాడు. డ్రెస్సేజ్ జూనియర్ విభాగంలో సత్తా చాటిన సాయి తన్వి రెండో స్థానం అందుకుంది.