సిటీబ్యూరో: వాటర్ బోర్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న జంక్షన్ పనుల కారణంగా తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మంగళవారం 10గంటల వరకు నీటి సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రాంతాల్లో బీహెచ్ఈఎల్, ఎంఐజీ-1, 2, రైల్ విహార్, చందానగర్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, కేపీహెచ్బీ పరిసర ప్రాంతాల్లో బల్క్ కనెక్షన్లు ఉంటాయి..
అదేవిధంగా పాక్షికంగా ప్రభావితమయ్యే ప్రాంతాల్లో షేక్పేట్, కోకాపేట్, మణికొండ, నార్సింగితోపాటు, గాయత్రీ నగర్, బోరబండ, ఈఎస్ఐ, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, ఎల్లారెడ్డి గూడ, అమీర్పేట్, వెంగళారావునగర్, సనత్ నగర్, నిమ్స్, బంజారాహిల్స్, తట్టిఖానా, సోమాజిగూడ, బీఎస్ మక్తా, ఎంఎస్ మక్తా, కొండాపూర్, ఆదిత్య నగర్, ప్రేమ్ నగర్, హపీజ్పేట్, మయూరినగర్, గోకుల్ ప్లాట్స్, మలేషియన్ టౌన్ షిప్, ఐడీఏ, బొల్లారం వంటి ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయంతోపాటు లోప్రెజర్ సమస్యలు ఉంటాయని తెలిపారు.