హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ ): మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ బందోబస్తు నిర్వహణకు తెలంగాణ హోంగార్డులు బయలుదేరారు. సోమవారం 2,000 మంది హోంగార్డులను ఛింద్వారా, సియాన్ జిల్లాలకు రాష్ట్ర పోలీస్శాఖ పంపింది. హోంగార్డ్స్ ఏడీజీ అభిలాష బిస్త్ మార్గనిర్దేశనంలో వెళ్లిన ఈ హోంగార్డుల కంటిజెన్సీకి హోంగార్డ్స్ ఎస్పీ ఐఆర్ఎస్ భాస్కర్, ఏసీపీ ఎం భాస్కర్ పర్యవేక్షకులుగా ఉంటారు.
హైదరాబాద్కు చెందిన 800 మంది హోంగార్డులకు ఏసీపీ పీ అరుణ్కుమార్, ఇతర జిల్లాలనుండి వచ్చిన 1,200 మంది హోంగార్డులకు ఏసీపీ భాసర్ నాయకత్వం వహిస్తున్నారు. ఆ రాష్ట్రంలో 17న ఎన్నికలు జరిగాక, అనంతరం హోంగార్డులు 19న హైదరాబాద్ చేరుకొంటారు.