హైదరాబాద్ : తెలంగాణకు సీఎస్ సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. చీఫ్ సెక్రటరీగా తెలంగాణలో సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్ తీర్పు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలని సోమేశ్ కుమార్ను కోర్టు ఆదేశించింది.
అయితే రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్ను కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించింది. దీంతో సోమేశ్ కుమార్ క్యాట్(కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్)ను ఆశ్రయించారు. ఈ క్రమంలో కేంద్రం ఉత్తర్వులు నిలిపివేసి తెలంగాణలో కొనసాగేలా క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక క్యాట్ మధ్యంతర ఉత్వర్వులతో సోమేశ్ కుమార్ తెలంగాణలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో క్యాట్ ఉత్తర్వులు కొట్టేయాలని 2017లో కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేస్తూ హైకోర్టు సీజే ధర్మాసనం మంగళవారం తీర్పు వెల్లడించింది. సోమేష్ కుమార్ న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలు 3 వారాలు నిలిపివేసింది కోర్టు. 2019, డిసెంబర్ నుంచి తెలంగాణ సీఎస్గా సోమేశ్ కుమార్ కొనసాగుతున్నారు.
గోల్కొండ ఫోర్ట్ ప్రాంతానికి చెందిన యువ ఇంజినీర్, నేషనల్ ఫుట్బాల్ క్రీడాకారుడు మహ్మద్ మన్ననుల్లా ఖాన్ నిరుద్యోగులు ఇబ్బందులు పడవద్దని నిర్ణయించుకున్నాడు. మొదటి సారి 2021లో డెక్కన్ బ్లాస్టర్స్ పేరిట పలు కంపెనీలతో మాట్లాడారు. లక్డీకాపూల్లోని ఉడ్బ్రిడ్జి హోటల్లో జాబ్ మేళాను ఏర్పాటు చేశారు. పదో తరగతి పాస్ కాక పోయినా.. వారి అర్హత ప్రకారం ఉద్యోగాలు లభించేలా చూస్తున్నారు. గతేడాది జాబ్ మేళాలను ప్రారంభించి 66 జాబ్ మేళాలను నిర్వహించి తొమ్మిది వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అమెజాన్, స్విగ్గి, జొమాటో, పలు సాఫ్ట్వేర్ కంపెనీలు, రిలయన్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్. విజయ్ సేల్స్ వంటి సంస్థల్లో ఉద్యోగాలు లభించేలా చూస్తున్నారు. మంగళవారం బెంగళూర్లో 67వ జాబ్ మేళాను Read More