హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సిట్ నుంచి సీబీఐకి బదలాయిస్తూ హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును రద్దు చేసింది. సీబీఐ దర్యాప్తునకు ఉత్తర్వులు జారీ చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. అయితే అదే అభ్యర్థనతో నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజి సంయుక్తంగా దాఖలు చేసిన పిటిషన్, న్యాయవాది బూసారపు శ్రీనివాస్, కేరళకు చెందిన భారత్ ధర్మ జనసేన అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి దాఖలు చేసిన మరో రెండు.. మొత్తం ఐదు వాజ్యాలను అనుమతించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి సోమవారం సాయంత్రం 4.20 గంటల సమయంలో తీర్పు చెప్పారు. కాగా, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై సిట్ హైకోర్టులో అప్పీలుకు వెళ్తుందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు.
తీవ్ర నేరాభియోగమే..
‘ఐదు వ్యాజ్యాలను అనుమతిస్తున్నాం. ఎమ్మెల్యేల ఎర కేసు సమాచారం బయటకు రావడంతో నిందితుల ఆందోళనచెందుతున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్రకు పాల్పడటం తీవ్రమైన నేరాభియోగం. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. అయితే, దర్యాప్తు ప్రాథమిక దశలోనే కీలక పత్రాలు బహిర్గతం
అయ్యాయి. వీడియో రికార్డింగ్ సీఎంకు ఎవరిచ్చారో సిట్ నుంచి స్పష్టత లేదు. (ఫిర్యాదుదారు రోహిత్రెడ్డి ఇచ్చి ఉంటారని అదనపు ఏజీ చెప్పడాన్ని ప్రస్తావించారు) దర్యాప్తు సమాచారం ఎవరూ పంచుకోడానికి వీల్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దర్యాప్తు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగదని నిందితుల్లో ఆందోళన ఉంది. సమస్యను నిందితు ల కోణం నుంచి కూడా చూడాలి. రాజ్యాంగంలోని 20, 21 అధికరణల కింద ఆరోపణలు ఎదురొనే వ్యక్తులకు రక్షణ కల్పించాలి. ఈ నేపథ్యంలో దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నాం’ అని న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి తీర్పులో పేర్కొన్నారు.
తీర్పు ప్రతి అందే వరకు సస్పెన్షన్
తీర్పు వెలువరించిన వెంటనే సిట్ తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కల్పించుకు ని, తీర్పు ప్రతి అందేవరకు దాని అమలును సస్పెన్షన్లో ఉంచాలని కోరారు. తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ఎదుట అప్పీల్ పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. ఏజీ అభ్యర్థనను న్యాయమూర్తి ఆమోదించారు. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ సిట్ అప్పీ ల్ పిటిషన్ దాఖలు చేస్తుందని ఏజీ చెప్పారు. మంగళవారమే అప్పీల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. దీనిని అత్యవసరంగా విచారణ చేపట్టాలని ద్విసభ్య ధర్మాసనాన్ని సిట్ కోరే అవకాశం కూడా ఉంది.
ఇదీ నేపథ్యం
ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్బై చెప్పి బీజేపీ లో చేరితే.. ఒకో ఎమ్మెల్యేకు 50 కోట్లు ఇస్తామని, ఈ బాధ్యతలు తీసుకున్నందుకు తనకు 100 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టారని ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్సీబీ, నందు, సింహయాజిని నిందితులుగా చేర్చుతూ పోలీసులు అక్టోబర్ 26న ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఆ తర్వాత రోజే బీజేపీ నేత ప్రేమేందర్రెడ్డి హైకోర్టులో దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని కోరు తూ రిట్ పిటిషన్ వేశారు. సిట్ దర్యాప్తు ఏకపక్షంగా సాగుతున్నదని, సీబీఐకి బదిలీ చేయాలని కోరారు. ఆ ముగ్గురు నిందితులకు సీఆర్పీసీలోని 41(ఏ) సెక్షన్ కింద నోటీసు ఇవ్వకుండా పోలీసులు అరెస్టు చేయడాన్ని తప్పుపడుతూ ఏసీబీ కోర్టు నిందితులను రిమాండ్కు అనుమతించే ఉత్తర్వుల జారీకి నిరాకరించిం ది. దీనిపై సిట్ హైకోర్టులో అప్పీ ల్ దాఖలు చేస్తే, అన్ని కేసుల్లోనూ 41(ఏ) నోటీసుల జారీ విధిగా ఇవ్వాలని లేదని న్యాయమూర్తి జస్టిస్ సుమలత తీర్పు చెప్పారు. అదేరోజు బీజేపీ నేత కేసులో మరో న్యాయమూర్తి, సిట్ దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఇచ్చా రు.
దీనిపై సిట్ అప్పీల్ పిటిషన్పై ద్విసభ్య ధర్మాసనం స్పందిస్తూ.. సిట్ దర్యాప్తు సింగిల్ జడ్జి పర్యవేక్షణలో జరగాలని షరతు విధించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 41(ఏ)నోటీసు జారీ అవసరమని చెప్తూనే క్రిమినల్ కేసుతో సంబంధం లేని ఒక రాజకీయ పార్టీ (బీజేపీ) రిట్ పిటిషన్ ఎలా వేస్తుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కోర్టుల్ని రాజకీయ వేదికలుగా చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. సిట్ దర్యాప్తు స్వతంత్రంగా జరగాలని, హైకోర్టు పర్యవేక్షణ కూడా అవసరం లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయంలోనే అప్పటివరకు సాక్షులుగా ఉన్న బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ ఇతరులకు సిట్ ఇచ్చిన 41(ఏ)నోటీసుపై హైకోర్టు స్టే విధించింది.
ఆ తర్వాత బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, న్యాయవాది శ్రీనివాస్ ఇతరులను నిందితులుగా చేర్చుతూ సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టేసింది. దీనిపై కూడా సిట్ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖ లు చేయగా.. దానిపై హైకోర్టు తీర్పు ఇవ్వా ల్సిఉంది. ఈ కేసును 4 వారాల్లోగా పరిషరించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా హైకోర్టులో ఒక కేసు తర్వాత మరో కేసు దాఖలవుతూ వచ్చాయి. మొయినాబాద్ ఫాంహౌ జ్ కేసు అక్టోబర్ 26న నమోదైంది. బీజేపీ అదే నెల 27న రిట్ దాఖలు చేయగా, 61వ రోజున హైకోర్టు తీర్పు వెలువరించింది.