హైదరాబాద్, నవంబర్ 16, (నమస్తే తెలంగాణ): కుమ్రం భీం జిల్లా కాగజ్నగర్ పోలీస్స్టేషన్లో నమోదైన దాడి కేసులో బీఎస్పీ నేత, మాజీ అదనపు డీజీ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్పై నమోదైన కేసు దర్యాప్తును కొనసాగించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ప్రవీణ్కుమార్ను అరెస్టు చేయొద్దని, ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని ఆదేశించింది.
తనపై ఈ నెల 13న నమోదైన కేసును రద్దు చేయాలని ప్రవీణ్కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కే సురేందర్ గురువారం విచారణ జరిపారు. దీనిపై సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్ గణేశ్ ప్రతివాదన చేస్తూ, పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నదని, ఏవిధమైన ఉత్తర్వులూ జారీ చేయనవసరం లేదని చెప్పారు.