హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రావణ్కుమార్ ధర్మాసనం.. జో గయ్య చేసిన సవరణలను పరిశీలించి పిల్గా పరిగణించేందుకు అంగీకరించింది. పిల్కు నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించిం ది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ జగన్పై దాఖలైన కేసు విచారణను సీబీఐ జాప్యం చేస్తున్నదని ఆరోపిస్తూ హరిరామ జోగయ్య పిల్ వేశారు. ఏపీ అసెంబ్లీ ఎ న్నికలు పూర్తయ్యేలోగా ఈ కేసులను తేల్చేలా ఆదేశాలివ్వాలని ఆయన కోర్టును కోరారు. ఈ మేరకు హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, విచారణను వాయిదా వేసింది.