హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కుమ్రంభీం జీవితచరిత్రలను వక్రీకరిస్తూ రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్) పేరుతో నిర్మించిన సినిమాను నిలిపివేయాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)ను హైకోర్టు కొట్టివేసింది. సినిమా వల్ల ప్రముఖల ప్రతిష్ఠకు భంగం వాటిల్లదని కోర్టు చెప్పింది. విషం సోక్రటీస్ చావుకు కారణం అయ్యిందే కానీ, ఆయన సాహిత్యానికి కాదని కోర్టు వ్యాఖ్యానించింది. వారిద్దరినీ దేశభక్తులుగా చూపామని, ఆర్ఆర్ఆర్ సినిమా కథ కల్పితమని నిర్మాత, దర్శకుల తరపు న్యాయవాది వాదించారు. కేంద్ర సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిందని, దీనిని పిటిషనర్ సౌమ్య సవాల్ చేయకుండా పిల్ దాఖలు చేయటం చెల్లదన్నారు. దీంతో పిల్ను కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ అభినందన్కుమార్ శావిలి ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.