హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్)తో సంబంధం లేకుండా అడ్మిషన్లు నిర్వహించుకునేందుకు హైకోర్టు 63 కాలేజీలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. డిగ్రీలో ఏకీకృత ప్రవేశాల కోసం ఈ నెల 11న దోస్త్ ఇచ్చిన నోటిఫికేషన్ను సవాలు చేస్తూ ఆ కాలేజీల వ్యాజ్యాలపై ఇటీవల ఆయన విచారణ జరిపారు. దీనిపై కౌం టర్ దాఖలు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖతోపాటు దోస్త్ కన్వీనర్కు, కాకతీయ, ఉస్మానియా వర్సిటీలకు నోటీసులు జారీచేసిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను జూన్ 15కి వాయిదా వేశారు. అడ్మిషన్ల అ న్ని కేసులను కలిపి విచారిస్తామని చెప్పారు.