హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్లోని 282, 293 సర్వే నంబర్లలో భూ ముల విక్రయానికి ఈ నెల 10న హెచ్ఎండీఏ నిర్వహించనున్న వేలా న్ని నిలిపివేయాలని కోరుతూ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేసింది.
ఆ భూముల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి 100 ఎకరాలు కేటాయించాలని కోరుతూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, బార్ అసోసియేషన్ పంపిన ప్రతిపాదనలను పట్టించుకోకుండా వేలానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయడం అన్యాయమని పేర్కొన్నది. బార్ అసోసియేషన్ సెక్రటరీ కట్టా ప్రదీప్రెడ్డి దాఖలు చేసిన ఈ పిల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు రెవెన్యూ, మున్సిపల్ శాఖల ముఖ్య కార్యదర్శులు, లా సెక్రటరీ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ కమిషనర్లు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రాజేంద్రనగర్ తాసీల్దార్లను ప్రతివాదులుగా చేర్చారు.