TG High Court | బీసీ రిజర్వేషన్ల పిటిషన్లపై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్ల జీవోపై దాఖలైన పిటిషన్పై హైకోర్టు శనివారం విచారించింది. రిజర్వేషన్ల జీవోను కొట్టివేయాలని మాధవరెడ్డి పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. పిటిషన్పై జస్టిస్ అభినందన్, జస్టిస్ విజయ్సేన్రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ పిటిషన్ వేసిన మాధవరెడ్డి.. బీసీ రిజర్వేషన్లను 27శాతం నుంచి 42శాతానికి పెంచారని ఆరోపించారు. మొత్తం రిజర్వేషన్ల పరిమితి 60శాతం దాటిందని.. రాజ్యాంగంలో 50శాతం రిజర్వేషన్లు దాటకూడదనే నిబంధన ఉందని పిటిషనర్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల జీవోను గెజిట్ చేశారా? అని కోర్టు ప్రశ్నించింది.
హైకోర్టు ప్రశ్నకు స్పష్టమైన సమాధానాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది ఇవ్వలేదు. దాంతో గెజిట్ చేయకముందే హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని కోర్టు ప్రశ్నించింది. బీసీల రిజర్వేషన్ల జీవో గెజిట్ కాకపోవచ్చని హైకోర్టుకు తెలిపిన ఏజీ సుదర్శన్రెడ్డి. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రిజర్వేషన్లు 50శాతం మాత్రమే ఉండాలని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. నూతన జీవో వల్ల రిజర్వేషన్ పరిమితి 67శాతానికి చేరిందని.. బీసీ రిజర్వేషన్లు 35శాతం పెంచుతూ 2018లో జీవో ఇచ్చారన్నారు. 2018లో ఇచ్చిన జీవోను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసిందని తెలుపగా.. తమిళనాడులో రిజర్వేషన్లు 69శాతానికి పెంచారు కదా? అని హైకోర్టు ప్రశ్నించింది. తొమ్మిదో షెడ్యూల్లో పెట్టి రిజర్వేషన్ పెంచారని చెప్పిన పిటిషన్ తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం అది సుప్రీంకోర్టులో విచారణలో ఉందని పిటిషనర్ తెలిపారు. పంచాయతీరాజ్ చట్టంలోని 285ఏని సవరిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారని.. అసెంబ్లీ తీర్మానం ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్లో ఉందన్నారు. గవర్నర్ దగ్గర బీసీ బిల్లు పెండింగ్లో ఉండగా.. జీవో విడుదల చేసి ముందుకు పోతాం అంటే ఎలా? అని నిలదీసింది.
గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జీవో విడుదల చేయడం సరికాదని.. రిజర్వేషన్లు 50శాతం మించకుండా ఉండాలి అనే నిబంధన ఉంది కదా! అని ప్రశ్నించింది. రిజర్వేషన్లపై అడ్వకేట్ జనరల్ను అనేక ప్రశ్నలు వేసిన హైకోర్టు దసరా సెలవుల తర్వాత ఈ మ్యాటర్ వినాలని హైకోర్టును అడ్వకేట్ జనరల్ కోరగా.. అప్పటి వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వమని చెప్తే మ్యాటర్ మీరు చెప్పినప్పుడు వింటామని బెంచ్ తెలిపింది. ప్రభుత్వాన్ని అడిగి సమాధానం చెబుతామని ఏజీ పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ తరఫు న్యాయవాదిని హైకోర్టు అక్టోబర్ 6 వరకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉంటారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. బీసీల రిజర్వేషన్లపై చట్ట ప్రకారమే ముందుకెళ్లాలని.. ఈ మేరకు విచారణ అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేసిన డివిజన్ బెంచ్ వాయిదా వేసింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినా మెరిట్ ఆధారంగా పిటిషన్ను విచారిస్తామని కోర్టు స్పష్టం చేసింది.