యాదాద్రి భువనగిరి : ఒమిక్రాన్ బీఎఫ్.7 వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిర్భయంగా ఉండాలని తెంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావు సూచించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం శ్రీనివాస్ రావు మీడియాతో మాట్లాడారు.
కొవిడ్ నాలుగో వేవ్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నాం అని తెలిపారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావుతో కొవిడ్పై పూర్తిస్థాయిలో సమీక్ష జరిపినట్లు పేర్కొన్నారు. యాదాద్రిశుడీ దయతో కొవిడ్ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం అని తెలిపారు. ఫోర్త్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్నా.. మరణాలు సంభవించే అవకాశం లేదన్నారు. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. 11 వందల కోట్లతో యాదాద్రి ప్రధానాలయాన్ని కృష్ణ శిలలతో ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారు అని డాక్టర్ శ్రీనివాస్ రావు ప్రశంసించారు.