హైదరాబాద్, మార్చి13 (నమస్తే తెలంగాణ): ‘రజాకార్ ’చిత్రం విడుదల కాకుండా ఉత్తర్వులు ఇవ్వాలని నేరుగా కోర్టును ఆశ్రయించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ)లోనే అప్పీలేట్ అథారిటీ వద్ద తేల్చుకోవాలని అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (ఏపీసీఆర్ )కు సూచించింది. రజాకార్ చిత్రం ఈ నెల 15న రిలీజ్ కానున్నది. మత కలహాలను రెచ్చగొట్టేలా చిత్రం ఉ న్నదని, విడుదలను ఆపాలని కోరుతూ ఢిల్లీకి చెందిన ఏపీసీఆర్ కార్యదర్శి మ హ్మద్ వాసిక్ నదీమ్ ఖాన్ వేసిన పిటిషన్పై విచారణను ముగిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జ స్టిస్ అనిల్కుమార్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.