మేడ్చల్ మల్కాజిగిరి : దేశానికే తిండి పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని, బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రల్లో అభివృద్ధి శూన్యమని కార్మిక శాఖ మత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం జవహర్నగర్ కార్పొరేషన్లోని డీయంఎఫ్టీ నిధులు రూ. 2.5 కోట్లతో 3, 19, 20, 21, 25 డివిజన్లలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన, 9, 22 డివిజన్లలో సీసీ రోడ్లను ప్రారంభించారు.
అనంతరం డీఎన్ఆర్ ఫంక్షన్హాల్లో ఆసరా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..బీజేపీ కేంద్ర మంత్రులు తెలంగాణ పర్యటిస్తు మాట్లాడుతున్న మాటలు వింటే విడ్డురంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ట్యాక్సుల రూపంలో కోట్ల రూపాయాలు కేంద్రానికి కడుతున్నామన్నారు.
రాష్ట్రానికి మాత్రం రూపాయి కూడా రాదని, 28 రాష్ట్రల్లో ఉన్న బీజేపీ పాలనలో ఆసరా పింఛన్లు రూ. 2016 ఇచ్చేది ఎక్కడా లేదన్నారు. దేశంలోని రైతులందరూ సీఎం కేసీఆర్ పాలనను చూసి ఆనందిస్తున్నారని తెలిపారు.
తెలంగాణాలోని కోటి కుటుంబాల్లో 46 లక్షల కుటుంబాలకు ఆసరా పింఛన్లు అందుతున్నాయని, రైతుబంధు, రైతుబీమా వంటి మరెన్నొ పథకాలతో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెడుతుందన్నారు.
అనంతరం 28వ డివిజన్లో బస్తీ దవాఖాను ప్రారంభించారు. బస్తీ దవాఖానతో పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తారని ఈ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి అన్నారు.
కార్యక్రమంలో మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కమిషనర్ జ్యోతిరెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్మెంబర్లు, పార్టీ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, మున్సిపల్ అధికారులు ప్రభాకర్యాదవ్, శ్రీనివాస్, వైద్య సిబ్బంది, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.