Telangana | హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిం ది. పంట ఏదైనా సరే… సాగులో మేటి అనిపించుకుంటున్నది. వరి, పత్తి, మి ర్చి వంటి పలు ప్రధాన పంటల సా గులో, ఉత్పత్తిలో తెలంగాణ తన సత్తా చాటుతున్నది. ఈ విషయాన్ని స్వ యంగా కేంద్ర ప్రభుత్వమే వెల్లడించిం ది. ఇటీవలి పార్లమెంట్ సమావేశాల్లో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు కేంద్రం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది.
ఒకప్పుడు దేశంలో వరికి పంజాబ్, మిర్చికి ఏపీ కేరాఫ్గా ఉండేవి. ప్రస్తు తం తెలంగాణ ఆ రాష్ర్టాలను తలదన్నే స్థాయికి చేరింది. ధాన్యం ఉత్పత్తిలో అట్టడుగున ఉండే తెలంగాణ ఇప్పుడు పంజాబ్తో పోటీ పడుతున్నది. గత వానకాలం సీజన్లో 62 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రెండో స్థానం లో నిలిచింది. ఈ యాసంగిలో మరో 90 లక్షల టన్నులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ లెక్కన మొత్తం ఏ డాదిలో పంజాబ్కు కాస్త అటు ఇటుగా తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయ డం గమనార్హం. ఇక మిర్చి ఉత్పత్తిలో ఏపీని అధిగమించిన తెలంగాణ దేశంలోనే నం.1గా నిలిచింది. 2021-22 లో ఏపీలో 4.17 లక్షల టన్నుల మిర్చి ఉత్పత్తి కాగా తెలంగాణలో 6.51 ల క్షల టన్నులు ఉత్పత్తి అయినట్టు కేం ద్రం వెల్లడించింది. గుంటూరులో 1.65 లక్షల టన్నులు ఉత్పత్తి కాగా ఖ మ్మం జిల్లాలో 1.86 లక్షల టన్నుల మిర్చి ఉత్పత్తి అయింది. ఇక పత్తి సా గు, ఉత్పత్తిలో మహారాష్ట్ర, గుజరాత్ త ర్వాత తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. గత సీజన్లో తెలంగాణలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా 55 లక్షల టన్నుల పత్తి ఉత్పత్తి అయిన ట్టు కేంద్రం వెల్లడించింది. గుజరాత్లో 87.12 లక్షల టన్నుల పత్తి ఉత్పత్తి అయినట్టు తెలిపింది. వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాబీన్ పంటల ఉత్పత్తిలోనూ తెలంగాణ సత్తా చాటుతున్నది.