ఒక్కరోజే 73 లక్షల విరాళాలు అందజేసిన నేతలు
హైదరాబాద్, ఫిబ్రవరి 23 : యాదవ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేందుకు రూ.10 కోట్ల వ్యయంతో నూతన యాదవ వసతి గృహాన్ని నిర్మించనున్నట్టు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బద్దుల బాబూరావు వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో నిర్వహించిన మహాసభ సమావేశంలో హాస్టల్ నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బాబూరావు, చింతల రవీందర్, దారబోయిన శ్రీను, చిర్రబోయిన బద్రినాథ్, బద్దుల ప్రశాంత్యాదవ్ రూ.5 లక్షల నుంచి రూ.11 లక్షల వరకు విరాళాలు ప్రకటించారు. దీంతో ఒక్కరోజే రూ.73 లక్షల విరాళాలు సమకూరినట్టు బాబూరావు వెల్లడించారు. సమావేశంలో మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్యాదవ్, కో ఆర్డినేటర్ చలకాని వెంకట్యాదవ్, ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్, ఇతర నేతలు పాల్గొన్నారు.