హైదరాబాద్, ఏప్రిల్1(నమస్తే తెలంగాణ): రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు సాయంత్రం 4 గంటల వరకు పనిగంటలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉపవాస దీక్షలు, ప్రార్థనలకు ఇబ్బంది కలుగకుండా ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే అన్ని రకాల ఉద్యోగులు విధుల నుంచి ఒక గంట ముందుగా వెళ్లడానికి అనుమతి ఇచ్చింది.
ఈ మేరకు సీఏస్ సోమేశ్కుమార్ సర్క్యులర్ జారీ చేశారు. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో పనిచేసే ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే విధులు ముగించుకుని వెళ్లేందుకు ఆర్టీసీ అనుమతించింది.