హైదరాబాద్, ఫిబ్రవరి7 (నమస్తే తెలంగాణ): నిరుడు జూలైలో తెలంగాణలో సంభవించిన వరదలకు పోలవరం ప్రాజెక్టే కారణమని తెలంగాణ సర్కారు పునరుద్ఘాటించింది. ఈ మేరకు నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్డబ్ల్యూడీఏ)కి తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం మరోసారి లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలవరం బ్యాక్వాటర్ ఎఫెక్ట్ సమస్యపై ప్రభావిత రాష్ర్టాలైన తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలతో కేంద్ర జలసంఘం వరుసగా సమావేశాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు దఫాలుగా సమావేశాలను నిర్వహించి వివరాలు సేకరించింది.
తాజాగా, జనవరి 25న మరోసారి ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ కుష్విందర్ వోరా అధ్యక్షతన సాగిన ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు ముంపు సమస్యలు, ఇతర సాంకేతిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆ మీటింగ్ మినిట్స్ను ఎన్డబ్ల్యూడీఏ ఇటీవల రాష్ర్టాలకు అందజేసింది. అందులో పలు అంశాలపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
తెలంగాణ వరదలకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధం లేదని, ఆ రాష్ట్రంలో కురిసిన వర్షాలు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడమే కారణమని ఏపీ తెలిపినట్టు ఆ సమావేశ మినిట్స్లో ఎన్డబ్ల్యూడీఏ నమోదుచేసింది. దీనిపై తెలంగాణ అభ్యంత రం వ్యక్తం చేసింది. వాస్తవంగా ఆ సమావేశం లో ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి వా దనలు వినిపించలేదని కొట్టిపారేసింది. వెం టనే మినిట్స్ నుంచి వాటిని తొలగించాలని డి మాండ్ చేసింది. రాష్ట్రంలో వరదలకు ముమ్మాటికీ పోలవరం స్పిల్వే, కాఫర్ డ్యా మ్ల నిర్మాణమే కారణమని నొక్కిచెప్పింది.