హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వయో పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం మరో రెండేండ్లు పెంచింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉద్యోగ వయోపరిమితి 34 ఏండ్లు ఉండేది.
అయితే.. యువత కు ఉద్యోగావకాశాల్లో మరిం త అవకాశం కల్పించాలనే సదుద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగ వయోపరిమితిని 44 ఏండ్ల వరకు పెం చింది. ప్రస్తుత ప్రభుత్వం దానిని మరో రెండేండ్లు పొడిగించింది.