ఇంగ్లిష్ మీడియం ఇలా..
2022-23 విద్యా సంవత్సరంలో 1 నుంచి 8వ తరగతి వరకు
2023-24లో 9వ తరగతికి, 2024-25లో 10వ తరగతికి
పిల్లలను ఏ మీడియంలో చదివించాలనేది తల్లిదండ్రుల ఇష్టం
హైదరాబాద్, మార్చి 6 : ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ అధికారాన్ని ఆయా పాఠశాలల ఫీజుల కమిటీలకే అప్పగించాలని క్యాబినెట్ సబ్ కమిటీ సూచించినట్టు తెలిసింది. ఫీజుల నిర్ధారణ కోసం స్కూల్ స్థాయిలో పది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయాలని, ఇందులో పాఠశాల యాజమాన్య ప్రతినిధి, ప్రిన్సిపాల్, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రాతినిథ్యం కల్పించాలని సూచించినట్టు సమాచారం. ఏటా ఫీజుల పెంపుదల 10 శాతం లోపే ఉండాలని అభిప్రాయపడినట్టు తెలుస్తున్నది. అడ్మిషన్, ట్యూషన్ ఫీజులను తప్పనిసరి జాబితాలోనూ, ఇతర ఫీజులను ఆప్షనల్ జాబితాలోనూ చేర్చినట్టు సమాచారం. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో రాష్ట్ర స్థాయి ఫీజుల కమిటీని ప్రభుత్వమే నియమించాలని మంత్రివర్గ ఉప సంఘం సూచించినట్టు తెలిసింది. స్కూల్ లెవల్ కమిటీ ఫీజులను ఖరారుచేయని పక్షంలో రాష్ట్ర కమిటీ నిర్ణయించాలని పేర్కొన్నది. ఈ నెల 2న హైదరాబాద్లో నిర్వహించిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో వివిధ అంశాలపై తీసుకొన్న నిర్ణయాల ప్రకారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ను ఆదేశించారు.
10 మందితో పాఠశాల విద్యా కమిటీ
మొత్తం పది మంది సభ్యులతో పాఠశాల స్థాయి ఫీజుల కమిటీని ఏర్పాటుచేసుకోవాలి. కమిటీ చైర్మన్గా పాఠశాల యాజమాన్య ప్రతినిధి, కార్యదర్శిగా ప్రిన్సిపాల్ వ్యవహరిస్తారు. అదే పాఠశాలకు చెందిన ముగ్గురు టీచర్లు సభ్యులుగా ఉంటారు. వీరిని యాజమాన్యమే నామినేట్ చేస్తుంది. మరో ఐదుగురు విద్యార్థుల తల్లిదండ్రులు సభ్యులుగా ఉంటారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఒక మైనారిటీ, ఇద్దరు ఇతరులు సభ్యులుగా ఉండాలి.
రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో రాష్ట్ర కమిటీ
రాష్ట్ర స్థాయిలో ఫీజుల నియంత్రణ కమిటీని ప్రభుత్వమే నియమించాలి. కమిటీకి చైర్మన్గా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని, సభ్యులుగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్/డైరెక్టర్తో పాటు విద్యారంగంలో విశేష అనుభవమున్న విద్యావేత్తలను నియమించాలి.
ఇంగ్లిష్ మీడియంపై మంత్రివర్గ ఉప సంఘం సిఫారసులు
ఫీజుల నియంత్రణకు సిఫారసులు