16% రిజర్వేషన్ కల్పించిన వైద్యారోగ్యశాఖ
హైదరాబాద్, మార్చి 13: దవాఖానల్లో పోషకాహారం అందించే డైట్ ఏజెన్సీలు, పారిశుద్ధ్య సిబ్బందిని నియమించే ఐహెచ్ఎఫ్ఎంఎస్ ఏజెన్సీల్లో దళితులకు ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించింది. దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం పలు విభాగాల్లో కోటా కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. దళితబంధుకు అనుబంధంగా లైసెన్సులు, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ కల్పిస్తున్నది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి హరీశ్రావు మార్గనిర్దేశంలో వైద్యారోగ్యశాఖ తాజాగా నూతన పాలసీని ఆవిష్కరించింది.