విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.60 కోట్లు నిధుల విడుదలకు పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి నేతన్నకు చేయూత కింద రూ.30 కోట్లు, చేనత మిత్రకు రూ.20 కోట్లు, పవర్లూమ్ వీవర్స్ తిప్ట్ ఫండ్ స్కీమ్కు రూ.10 కోట్లు మంజూరుచేసింది.
ఈ మేరకు సోమవారం బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం ఉత్తర్వులు జారీచేశారు.