హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): డిప్యూటీ కలెక్టర్లుగా పని చేస్తున్న 31 మంది అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు శుక్రవారం తాత్కాలిక ప్రమోషన్లు ఇస్తూ సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. పదోన్నతి కల్పించడంపై రెవెన్యూ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. పదోన్నతులతో ఖాళీ అయిన పోస్టుల్లో తాసిల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. ఈ పదోన్నతులపై తెలంగాణ డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, కోశాధికారి భాస్కర్రావులు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కే గౌతమ్కుమార్లు ట్రెసా రాష్ట్ర కమిటీ తరఫున సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్కుమార్కు కృతజ్ఞతలు తెలియజేశారు.
పదోన్నతి పొందిన అధికారులు..
ఆర్డీ మాధురి, బీ రోహిత్సింగ్, ఏ పద్మశ్రీ, గుగులోతు లింగ్యానాయక్, మహ్మద్ అసదుల్లా, కేవీవీ రవికుమార్, డీ రాజ్యలక్ష్మి, కనకం స్వర్ణలత, జీ వెంకటేశ్వర్లు, వీ భుజంగరావు, డీ వెంకట మాధవరావు, ఎం వెంకట భూపాల్రెడ్డి, చీరెళ్ల శ్రీనివాసులు, ఎస్ తిరుపతిరావు, చీమలపాటి మహేందర్జీ, కే గంగాధర్, బస్తూకర్ కిషన్రావు, సల్వర్ సూరజ్కుమార్, ఈ వెంకటాచారి, వీ విక్టర్, ఎల్ కిశోర్కుమార్, పీ అశోక్కుమార్, ఎం విజయలక్ష్మి, జే శ్రీనివాస్, డీ విజయేందర్రెడ్డి, కే శ్యామలాదేవి, కే వీరబ్రహ్మాచారి, హరిప్రియ, కే లక్ష్మీకిరణ్, డీ వేణు, టీఎల్ సంగీత.