హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని తంగెళ్లపల్లి వద్ద పెద్దవాగుపై రూ.16.38 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే చెక్డ్యామ్/కాజ్వే నిర్మాణానికి ప్రభుత్వం గురువారం అనుమతులు మంజూరు చేసింది.
పెద్దపల్లి జిల్లా మూలసాల గ్రామం వద్ద హుస్సేమియా వాగుపై చెక్డ్యామ్ పునర్నిర్మాణానికి రూ.4,19,80,000 నిధులను ప్రభుత్వం విడుదలచేసింది.