హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. నార్మల్ డెలివరీ చేస్తే వైద్య సిబ్బందికి రూ.3 వేలు ప్రోత్సాహకం అందించనున్నది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్తో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరిగాయి. సాధారణ ప్రసవాల వల్ల కలిగే ప్రయోజనాలను వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ప్రతి సందర్భంలోనూ వివరిస్తూ, అధికారులతో ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తూ నిత్యం పర్యవేక్షిస్తుండటంతో సాధారణ ప్రసవాలు గణనీయంగా పెరిగాయి. దీన్ని మరింత ప్రోత్సహించేలా ‘టీమ్ బేస్డ్ ఇన్సెంటివ్’ పేరుతో ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఇందులో ప్రభుత్వ దవాఖానల్లో జరిగే ప్రతి సాధారణ ప్రసవానికి రూ.3 వేలు అందిస్తారు. ఈ నిధులను ప్రతి నెల సూపరింటెండెంట్కు విడుదల చేస్తారు. వారు సిబ్బందికి లెక్క ప్రకారం అందించాల్సి ఉంటుంది. ఇందుకు కొన్ని నిబంధనలను విధించారు.
ఇవీ నిబంధనలు: