హైదరాబాద్ : ఈ నెల 8న నల్లగొండ జిల్లాలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పర్యటించనున్నారు. నల్లగొండ పట్టణం షేర్బంగ్లా సమీపంలోని సంతోషిమాత ఆలయాన్ని గవర్నర్ ప్రారంభించనున్నారు. అనంతరం అర్జాలబావి, అనిశెట్టి దుప్పలపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గవర్నర్ పరిశీలించనున్నారు. నల్లగొండ పర్యటనకు రోడ్డు మార్గంలోనే గవర్నర్ బయల్దేరనున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ వెళ్లే మార్గంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.