హైదరాబాద్: సీబీఐ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థ రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేయాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. దర్యాప్తు కోసం సీబీఐకి గతంలో ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నది. ఈ మేరకు ఆగస్టు 30న రాష్ట్ర ప్రభుత్వం జీఓ 51ని జారీచేసింది. ఇక ఏ కేసులోనైనా సీబీఐ దర్యాప్తు చేయాలంటే.. జీవో 51 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే.