ములుగు: తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ములుగు జిల్లా ఏటూరునాగారం ప్రధాన రహదారిలో ఆయన కారుకు యాక్సిడెంట్ జరిగింది. జీడివాగు సమీపంలో ఒక బైక్ను ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
బైక్ను ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో కారు అదుపు తప్పిన కారు పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి కారు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న ఇద్దరు డ్రైవర్లకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో కారులో విప్ కాంతారావు లేరు. దీంతో ఆయనకు త్రుటిలో ప్రమాదం తప్పినట్లయింది.