ఆదిలాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు బాగున్నాయని, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభు త్వం ఒక్క పథకాన్నీ ప్రవేశపెట్టలేదని ఆ రా ష్ర్టానికి చెందిన వలస కూలీ తన మనోగతాన్ని వెల్లడించాడు. కనీస సౌకర్యాలు కల్పించడంలోనూ విఫమైందని ఆవేదన వ్యక్తం చేశాడు. గురువారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని తంతోలిలో జరిగిన బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలో ఛత్తీస్గఢ్కు చెందిన వలస కూలీ గణేశ్ పటేల్ మాట్లాడుతూ.. ‘మాది ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాజనందిగాం జిల్లా డొంగ్రగాం. మా రాష్ట్రంలో ఉపాధి లేక ఆదిలాబాద్ జిల్లా కు వలస వచ్చాం. రెండేండ్లుగా ఇక్కడే ఉంటూ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు చేస్తు న్నాం.
తెలంగాణ ప్రభుత్వం ప్రజల కోసం బాగా పనిచేస్తున్నది. మా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల హామీలు ఇస్తున్నది. కూలీల పరిస్థితి దుర్భరంగా ఉంది. మాకు రూ.300 కూలి దొరుకుతది. ఇక్కడ రూ.800 కూలి ఇస్తున్నరు. అందుకే దాదాపు 4 లక్షల నుంచి 5 లక్షల మంది రైతులు, కూలీలు పను లు లేక ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు వలసొచ్చి ఉపాధి పొందుతున్నారు. మా దగ్గర వృద్ధులకు రూ.300 పింఛన్ ఇస్తున్నరు. తెలంగాణలో రూ.2,016 ఇస్తున్నరు. పేదింటి ఆడపిల్లల వివాహాలకు మా ప్రభుత్వం సాయం చేయదు.
తెలంగాణ సర్కారు రూ.1,00,116 ఇస్తున్నది. ఇక్కడి ప్రభుత్వం రైతుబంధు కింద ఎకరాకు రూ.10 వేల పెట్టుబడి సాయం అందజేస్తున్నది. మా రాష్ట్రంలో గర్భిణులు ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవిస్తే డబ్బులు రావు. ఇక్కడ రూ.12 వేలు ఇస్తున్నారు. మా దగ్గర రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. రోడ్లపై సైకిల్ కూడా నడిపే పరిస్థితి ఉండదు. కరెంటు ఎప్పుడూ పోతది. చీకట్లోనే ఉంటం. తెలంగాణలో మారుమూల గ్రామాల్లో కూడా విద్యుత్తు వెలుగులు విరజిమ్ముతున్నాయి. తెలంగాణలో సంక్షేమ పథకాలతో అన్ని వ ర్గాల ప్రజలు ప్రయోజనం పొందుతూ సంతోషంగా ఉన్నారు’ అని వివరించాడు.