హైదరాబాద్: తెలంగాణ స్థితిగతులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) రూపొందించిన నివేదకను రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో (Assembly) ప్రవేశపెట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరం అకౌంట్స్, ఫైనాన్స్ అకౌంట్స్పై కాగ్ నివేదించింది. నీటిపారుదల, వైద్యారోగ్యం, పంచాయతీరాజ్ శాఖలకు 30 శాతం అధికంగా ఖర్చుచేసిందని నివేదికలో వెల్లడించింది. గృహ నిర్మాణం, పరిశ్రమల శాఖల కేటాయింపు కంటే తక్కువగా ఖర్చు చేసిందని పేర్కొంది. 11 గ్రాంట్లకు రూ.75 వేల కోట్లు అధికంగా వ్యయం చేసిందని వివరించింది.
289 రోజుల పాటు స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుందని తెలిపింది. 2020-21లో రెవెన్యూ లోటు రూ.9335 కోట్లుగా ఉందని వెల్లడించింది. కేంద్ర నుంచి వచ్చే గ్రాంట్లు 44 శాతం తగ్గాయని పేర్కొంది. రెవెన్యూ రాబడుల్లో 50 శాతం వేతనాలు, వడ్డీలకే చెల్లిస్తున్నదని చెప్పింది.