Telangana | రాష్ట్రంలో మరో మండలం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నిజామాబాద్ జిల్లాలోని రామడుగు గ్రామాన్ని మండలంగా మార్చాలని ప్రతిపాదించింది.
ధర్పల్లి, డిచ్పల్లి మండలాల్లోని ఏడు గ్రామాలను చేరుస్తూ రామడుగు మండలం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రాథమిక నోటిఫికేషన్ను శుక్రవారం జారీ చేసింది. వీటిపై అభ్యంతరాలు, వినతులు ఏవైనా ఉంటే తెలియజేసేందుకు 15 రోజుల గడువునిచ్చింది.