Diet Charges | తెలంగాణలోని సంక్షేమ వసతిగృహాల్లో డైట్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రకాల గురుకులాల్లో డైట్ చార్జీలు పెరుగనున్నాయి. పలు శాఖలకు చెందిన అనుబంధ హాటల్స్లోనూ డైట్చార్జీలు పెరుగనున్నది. 3వ తరగతి 7వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.950 నుంచి రూ.1200కు పెంచింది. 8 నుంచి పదో తరగతి వరకు రూ.1100 నుంచి రూ.1400 వరకు పెంచింది. ఇంటర్ నుంచి పీటీ వరకు రూ.1500 నుంచి రూ.1875కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.