హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): సర్కార్ దవాఖానల్లో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) కింద స్పెషలిస్ట్ వైద్యుల నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
డీఎంఈ పరిధిలో గతంలో 850 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించడం, మరో 1,863 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడం, తెలంగాణ వైద్య విధాన పరిషత్తు (టీవీవీపీ) పరిధిలో ఇటీవల 860 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను నియమించడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ దవాఖానల్లో స్పెషలిస్టుల కొరత ఏర్పడనున్నదని వైద్యవర్గాలు తెలిపాయి.