హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి ఉద్యోగ భద్రత, వేతన పరిరక్షణ, క్రమబద్ధీకరణ చేసే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని శాసనమండలిలో బీజేపీ సభ్యుడు మల్క కొమురయ్య డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బాలికలకు విద్యతోపాటు వసతి, సంరక్షణ అందించడంలో కేజీబీవీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని, అయినప్పటికీ 15 నుంచి 20 ఏండ్లుగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలోనే పనిచేస్తున్నారని పేర్కొన్నారు. శాసనమండలిలో గురువారం కొమురయ్య కేజీబీవీ ఉద్యోగుల సమస్యలు, ప్రైవేట్ వర్సిటీలు, పునరుత్పాదక ఇంధనం లాంటి పలు అంశాలపై మాట్లాడారు.