హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 9.61 లక్షల పెండింగ్ చలాన్ల ద్వారా ప్రభుత్వానికి గురువారం నాటికి 8.44 కోట్ల ఆదాయం సమకూరింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3.54 లక్షల చలాన్ల ద్వారా 2.62 కోట్లు, సైబరాబాద్ పరిధిలో 1.82 లక్షల చలాన్ల చెల్లింపు ద్వారా రూ.1.80 కోట్లు, రాచకొండ పరిధిలో 93 వేల చలాన్లకు రూ.76.79 లక్షల ఆదాయం సమకూరిందని ఉన్నతాధికారులు తెలిపారు.
హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని జీఏడీ అధికారులు ఒక ప్రకటనలో ఖండించారు. ‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఎవరైనా ఇబ్బందులకు గురిచేసినా, వారితో అసభ్యకరంగా మాట్లాడినా, దురుసుగా ప్రవర్తించినా, ఉద్యోగి విధులకు ఆటం కం కలిగించినా, చేయి చేసుకున్నా ఐపీసీ సెక్షన్ల కింద చర్యలు తీసుకోబడును’ అంటూ సీఎస్ హెచ్చరించిన ప్రచారం పూర్తిగా అవాస్తవమని జీఏ డీ అధికారులు వివరణ ఇచ్చారు.