హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ సూచనలను అనుసరించి అన్ని విభాగాలు తమ సిబ్బందికి టీకాలు వేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో భాగంగా అటవీశాఖ నగరంలోని అరణ్య భవన్లో గురువారం ప్రత్యేక టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మొదటిరోజు 90 మంది ఉద్యోగులు వ్యాక్సినేషన్ వేసుకున్నారు. అటవీశాఖలో దాదాపు 6 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
ఎక్కువ మంది ఉద్యోగులు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు 75 శాతం మంది ఉద్యోగులు వ్యాక్సినేషన్ పొందారు. మిగిలిన ఉద్యోగులకు కూడా కొద్ది రోజుల్లో వ్యాక్సినేషన్ పూర్తి అవుతుందన్నారు. పెరుగుతున్న కొవిడ్ -19 కేసుల దృష్ట్యా అటవీ సిబ్బంది అందరికీ టీకాలు వేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరన్ రెడ్డి ఆదేశించారు.