హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో అందజేసే రూ.లక్ష రుణ సాయానికి అర్హత కలిగిన క్రిస్టియన్లు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 31 నుంచి ఆగస్టు 14 వరకు క్రిస్టియన్ కార్పొరేషన్కు దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. http:// tsobmmssbc.cgg. gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు పంపాలన్నారు.