హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అవసరాలు తీరిన తర్వాతే గోదావరి నీటిని ఇతర బేసిన్లలోకి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా చూస్తే గోదావరి-కావేరి నదుల అనుసంధానానికి సహకరిస్తామని టాస్క్ఫోర్స్ కమిటీకి హామీ ఇచ్చింది. నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం ఈ నెల 6న హైదరాబాద్లో జరిగింది. కేంద్ర జల్శక్తి మంత్రిత్వశాఖ సలహాదారు, టాస్క్ ఫోర్స్ చైర్మన్ వెదిరె శ్రీరాం అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ హాజరయ్యారు. ఏపీ, ఇతర రాష్ర్టాల అధికారులు ఆన్లైన్లో పాల్గొన్నారు. ఆ సమావేశ వివరాలను జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) శుక్రవారం విడుదల చేసింది.
ఆ వివరాలు ఇవీ..