హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా రామకృష్ణారావు అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో సంభాషిస్తూ.. రాష్ట్రంలో అప్పులు తీసుకోవడానికి అవకాశం ఉందన్నారు. రూ. 12 వేల కోట్లు రిపేమెంట్ చేస్తాం కాబట్టి అప్పులు తీసుకునే కెపాసిటీ పెరుగుతుందన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే బయటి నుంచి ఆదాయం తీసుకురావాలన్నారు. గ్రోత్ రేట్ తగ్గినా ఆదాయానికి అవకాశం ఉందని చెప్పారు. గత పదేళ్ళలో మొదటిసారి గ్రోత్ రేట్ తగ్గింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నాలుగు నెలలకే పెట్టాము. మళ్ళీ పూర్తి స్థాయి బడ్జెట్ జూలై నెలలోనే ఉంటుంది. కొత్త నియామకాల కోసం బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు ప్రతిపాదించామని రామకృష్ణారావు తెలిపారు.