ఓటమి భయంతోనే ఈటల రాజేందర్ పరుష పదజాలం ఉపయోగిస్తున్నారని మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. ‘బీజేపీలోకి వెళ్లిన ఈటల రాజేందర్ కొత్త భాష నేర్చుకుని, తండ్రి లాంటి కేసీఆర్ను రా అని సంబోధిస్తున్నారు. తనను ఒరేయ్ హరీశ్ అని వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయ ఓనమాలు నేర్పి, ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి, రెండుసార్లు మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్ను అలా సంబోధించడం సరైంది కాదు` అన్నారు.
ఈటల ఎలాంటి పదజాలం వాడినా.. తాము మాత్రం రాజేందర్ను గౌరవంగా పిలుస్తామని తెలిపారు. ఓటమి భయంతోనే మాటలు తూలుతున్నారని హరీశ్రావు మండిపడ్డారు.