హైదరాబాద్ : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పంప్డ్ హైడ్రో స్టోరేజ్ పథకాలపై ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా కృష్ణాపై ఏపీ పంప్డ్ స్టోరేజ్ పథకాలను చేపట్టిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. అనుమతుల్లేని ప్రాజెక్టులను నిలువరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ చేపట్టిన అన్ని పంప్డ్ స్టోరేజ్ పథకాల వివరాలు తెప్పించి ఇవ్వాలని బోర్డును కోరారు. కర్నూల్ జిల్లా పిన్నాపురం వద్ద చేపట్టిన గ్రీన్ కో విద్యుత్ ప్రాజెక్టుపై కూడా ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా ప్రాజెక్టు కోసం కృష్ణా జలాలను వినియోగించరాదని తెలిపారు.