Government Teachers | హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): సహజంగా టీచర్లకు జీతం ఎక్కువగా ఉండటం.. ట్యూటర్లకు తక్కువ ఉండటం మనం చూస్తుంటాం. ఇందుకు భిన్నంగా టీచర్లకు తక్కువ జీతం.. ట్యూటర్లకు ఎక్కువ జీతం ఇవ్వాలని తెలంగాణ విద్యా కమిషన్ సర్కార్కు సూచించింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్లో(టీపీఎస్) ప్రీ స్కూల్ టీచర్లకు నెలకు రూ. 16వేల వేతనం ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఇదే బడుల్లో పనిచేసే స్పెషల్ టీచర్లకు మాత్రం నెలకు రూ. 20 వేల వేతనం ఇవ్వాలని సూచించింది.
టీపీఎస్ బడులపై డ్రాఫ్ట్ బిల్లును కమిషన్ సర్కార్కు సమర్పించింది. ఈ నివేదికను పరిశీలిస్తే అనేక వింతలు, విశేషాలు వెలుగుచూస్తున్నాయి. ఇదే స్కూళ్లల్లో పనిచేసే హెచ్ఆర్ అసిస్టెంట్, ఫైనాన్స్ అండ్ అకౌంట్ అసిస్టెంట్, స్టూడెంట్ రిలేషన్స్ అసిస్టెంట్, ట్రాన్స్ఫోర్ట్ సూపర్వైజర్, ల్యాబ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్, నర్సు, హెడ్కుక్లకు నెలకు రూ. 20వేల వేతన ఇవ్వాలని కమిషన్ సూచించింది. బోధనేతర సిబ్బందికి నెలకు రూ. 20వేలు.. అత్యంత కీలకమైన పునాది వంటి పూర్వప్రాథమిక విద్యను బోధించే టీచర్లకు నెలకు రూ.16వేల వేతనం ఇవ్వాలని కమిషన్ సూచించడం విమర్శలకు తావిస్తున్నది. టీచర్లను లక్ష్యంగా చేసుకోవడం, టీచర్ల గౌరవాన్ని తగ్గించే చర్యలపై టీచర్ల సంఘాలు మండిపడుతున్నాయి.
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్వహణకు రూ. 1.57 కోట్ల వ్యయం కానున్నది. దీంట్లో నాన్ టీచింగ్ స్టాఫ్ వేతనాలు రూ.52లక్షలు కాగా, ప్రీ ప్రైమరీ, ఎక్స్ట్రా కరిక్యులర్/సహ పాఠ్యప్రణాళికలు బోధించే టీచర్ల వేతనాలు రూ.39 లక్షలు మాత్రమే. బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్కు నెలకు రూ. 60లక్షలు ఖర్చవుతుందని విద్యాకమిషన్ అంచనావేసింది. మొత్తానికి రెగ్యులర్ టీచర్ల వేతనం అదనం. రెగ్యులర్ టీచర్లు ఉండగా, 18 రకాల సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించాలని కమిషన్ సూచించింది. ఒక సైకాలజిస్ట్, ప్రతి 200 మందికి ఒక కిచెన్ హెల్పర్, కుక్, ఒక నర్సు, నలుగురు అటెండర్లు, ఆరుగురు సెక్యూరిటీ గార్డులు, ప్రతి 150 మందికి ఒకరు చొప్పున శానిటైజేషన్ వర్కర్లు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్ల చొప్పున 16 నుంచి 25 మంది సిబ్బందిని నియమించాలని కమిషన్ సూచించింది.
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ను మండలం యూనిట్గా ప్రారంభించాలని కమిషన్ సూచించింది. అయితే మండలానికి ఒకటా..? రెండా..? అన్న సందేహాలు వస్తున్నాయి. వీటిని మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తామని సర్కార్ ప్రకటించింది. అయితే విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి మండలానికి రెండు స్కూళ్లు మంజూరుచేసినట్టు ప్రకటించారు. ఇవి కూడా అన్ని మండలాల్లో కాదని, నియోజకవర్గంలోని ఒక మండలం మాత్రమేనన్న వాదనలు ఉన్నాయి. ఇవి కొత్తగా ఏర్పాటు చేసేవి కావని, ఇప్పటికే ఉన్న బడులను టీపీఎస్లుగా మారుస్తామని విద్యాకమిషన్ వర్గాలు అంటున్నాయి.
టీచర్ల వేతనాలపై విద్యాకమిషన్ వైఖరి గర్హనీయం. కమిషన్ తీరును మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. కమిషన్ ఇచ్చిన నివేదికలో అనేక లోపాలున్నాయి. టీచర్ల కృషిని తక్కువ చేసే ప్రయత్నంపై విచారం వ్యక్తంచేస్తున్నాం. టీచర్ పదోన్నతులు సీనియార్టీకి బదులు పారామీటర్లు/ప్రమాణాలు నిర్ధేశించడం అర్ధరహితం. ఇది సర్వీస్ రూల్స్కు పూర్తి వ్యతిరేకం. అవగాహన రాహిత్యంగా మేం భావిస్తున్నాం. 50% హెచ్ఎం పోస్టులను డైరెక్టర్ రిక్రూట్మెంట్ కోటాలో భర్తీచేయాలనడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తహసీల్దార్, ప్రిన్సిపాల్/హెచ్ఎం, సీఐ వంటి పోస్టులు అనుభవం ఆధారంగా పదోన్నతి కల్పించే పోస్టులు. వీటిని నేరుగా రిక్రూట్చేస్తే ఇబ్బందులు వస్తాయి. టీచర్ల అర్హతల నిర్ణయాధికారం ఎన్సీటీఈకే ఉంది. జాతీయంగా ఒకే విధానం అమలవుతుంది. దీన్ని ఎలా మారుస్తారు. ఇలాంటి కమిషన్ సిఫార్సులను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మా అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం.
– పుల్గం దామోదర్రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
మరికొన్ని సిఫార్సులు