హైదరాబాద్: రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భక్తీకి సంబంధించిన డీఎస్సీ (TS DSC) దరఖాస్తుల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నది. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత ఆన్లైన్ అప్లికేషన్లు షురూ అవనున్నాయి. ఏప్రిల్ 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నది. మొత్తం 11,062 పోస్టులకు భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనే విషయాన్ని విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా జిల్లాల వారీగా ఏ సబ్జెక్టుకు ఎన్ని ఖాళీల వివరాలు, ఖాళీలకు సంబంధించిన రోస్టర్ను తాజాగా విడుదల చేసింది. సిలబస్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే (సీబీటీ) ఈ పరీక్షల తేదీలను ఇంకా వెళ్లడించలేదు. త్వరలోనే ప్రకటిస్తామని అందులో పేర్కొన్నది.