పటాన్చెరు, మే 25: పకడ్బందీగా లాక్డౌన్ను అమలుచేస్తున్నామని డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ముత్తంగి ఔటర్రింగ్రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన పోలీస్ చెక్పోస్టును ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి పోలీసులు చేపడుతున్న తనిఖీ వివరాలను డీజీపీకి వివరించారు. అంబులెన్స్, వైద్య సంబంధిత వాహనాలనే అనుమతించాలని చెప్పారు. ఈ పాస్ను చెక్ చేసి వాహనాలను వదలాలని తెలిపారు. ఈ సందర్భంగా డీజీపీ విలేకరులతో మాట్లాడారు. కొవిడ్ మహమ్మారిని జయించాలంటే లాక్డౌన్ను పకడ్బందీగా అమలుచేయాల్సిన అవసరమున్నదని చెప్పారు. వైరస్ను అదుపుచేసేందుకు కృషిచేస్తున్న వైద్య శాఖకు సహకరించేందుకే లాక్డౌన్ను కఠినంగా అమలుచేస్తున్నామని తెలిపారు. చిన్నపాటి అవసరాలకు ప్రజలు రోడ్లపైకి రావొద్దని సూచించారు. ఎమర్జెన్సీ, మెడికల్ వాహనాలు, రోగులు, వారి సంరక్షకులకు అనుమతినిస్తున్నామని చెప్పారు. పారిశ్రామికవాడల్లో ఫార్మా, బల్క్డ్రగ్ పరిశ్రమలు వందశాతం పనిచేసేలా అనమతులు ఇస్తున్నామని తెలిపారు. ఇతర పరిశ్రమలు తమ అవసరాల మేరకు అనుమతులు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో పటాన్చెరు డీఎస్పీ భీంరెడ్డి, సీఐ వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.