హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 3(నమస్తే తెలంగాణ): మంత్రి శ్రీనివాస్గౌడ్ హత్యకు కుట్ర కేసులో అరెస్టయిన 8 మందిని గురువారం సైబరాబాద్ పోలీసులు రిమాండ్కు తరలించారు. రాఘవేంద్రరాజు, అమరేందర్రాజు, మున్నూరు రవి, నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్, థాపాను మేడ్చల్ కోర్టులో హాజరుపర్చి, అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. నిందితులను పది రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లో కోర్టుకు వివరించారు. పోలీసులు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో వారు ఇచ్చిన వాంగ్మూలాలను సమర్పించారు. రాఘవేంద్రరాజు ఇచ్చిన వాంగ్మూలంలో తనను మంత్రి శ్రీనివాస్గౌడ్ గత పదేండ్ల నుంచి వేధిస్తున్నాడని, ఆర్థికంగా నష్టం చేశాడని.. ఆ కోపంతో అతనిని హత్య చేసేందుకు సుపారీ ఆఫర్ ఇచ్చినట్టు పేర్కొన్నాడు. కస్టడీకి తీసుకొంటే కీలకాంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నది.