తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1673 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారికి ఒక వ్యక్తి బలయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు కరోనా బులెటిన్ విడుదల చేశారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 48,583 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.
వీరిలో 1,673 మందికి కరోనా పాజిటివ్ ఫలితం వచ్చింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,94,030కి చేరింది. అలాగే ఒకరు కరోనాతో మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కరోనా మరణాల సంఖ్య 4,042కు చేరింది.
గడిచిన 24 గంటల్లో 330 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13,522 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.