Congress | నిండైన చెరువులతో మెండైన పంటలతో తెలంగాణ ఒకనాడు అన్నపూర్ణగా, ఆగర్భ శ్రీమంత ప్రాంతంగా వర్ధిల్లింది. నిజాముల పాలనలో కూడా తెలంగాణ ఏనాడూ కరువును చూసి ఎరుగలేదు. అలాంటి తెలంగాణ ఆంధ్రలో కలువగానే అన్నమో రామచంద్ర అని ఎందుకు మొత్తుకొన్నది? మిగులు నిధులతో సిరిసంపదలతో ఉన్న తెలంగాణను ఆశ్రిత ప్రాంతంగా, అడుక్కునే స్థాయికి దిగజార్చే కుట్రలు చేసిందెవరు? ‘మేం మీతో కలుస్తాం ప్రభో! అని బతిమిలాడుకొన్నవారు.. సమైక్య రాష్ట్రం ఏర్పడుతూనే ఆధిపత్యులుగా ఎలా మారిపోయారు? అన్ని వనరులూ ఉండి మేం స్వతంత్రంగానే ఉంటాం అన్న తెలంగాణ, ఉన్నట్టుండి ‘రక్షణలు’ కోరే ప్రాంతంగా ఎందుకు దిగజారింది? ఈ పాపానికి కారకులెవరు?
తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహాలు, పాపాల గురించి చెప్పాలంటే పెద్దపెద్ద గ్రంథాలే రాయాల్సి ఉంటుంది. కానీ, ఒక్కమాటలో ఆ పార్టీ ద్రోహాలను చెప్పాలంటే తెలంగాణ, ఆంధ్ర విలీన సమయంలో చేసుకొన్న పెద్దమనుషుల ఒప్పందం ఒక్కటి చాలు. ఈ ఒక్క ఒప్పందంతో సిరిసంపదలతో ఉన్న తెలంగాణను అడుక్కుతినే స్థాయికి దిగజార్చింది కాంగ్రెస్ పార్టీ. 1954లో మహారాష్ట్ర ఏర్పాటు సందర్భంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒప్పందాల గురించి అంబేద్కర్ చెపుతూ, ‘సూర్యచంద్రులున్నంత వరకు కాంగ్రెస్ నేతలు ఉంటామని భావించి నిర్ణయాలు తీసుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. ఈ మాటలు సరిగ్గా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు 1956లో జరిగిన పెద్దమనుషుల ఒప్పందానికి కూడా వర్తిస్తాయి. ఒకటే అబద్ధాన్ని మళ్లీమళ్లీ చెప్పి మోసం చేసిన సందర్భం పెద్దమనుషుల ఒప్పందంలో జరిగింది. 1937లో శ్రీబాగ్ ఒప్పందం పేరుతో రాయలసీమకు ఆంధ్ర రాజకీయవర్గం అబద్ధపు వాగ్దానాలిచ్చింది. తెలంగాణను కలుపుకోవడానికి ఆంధ్ర కాంగ్రెస్ పాలకవర్గం పెద్దమనుషుల ఒప్పందం పేరుతో మళ్లీ ఒక నాటకం ఆడింది. ఈ నాటకంలో తెలంగాణ ప్రజల పాత్ర లేదు. ఉన్నదంతా కాంగ్రెస్ నాయకులే.
1937లో శ్రీబాగ్ ఒప్పందం పేరుతో రాయలసీమకు ఆంధ్ర రాజకీయవర్గం అబద్ధపు వాగ్దానాలిచ్చింది. తెలంగాణను కలుపుకోవడానికి ఆంధ్ర కాంగ్రెస్ పాలకవర్గం పెద్దమనుషుల ఒప్పందం పేరుతో మళ్లీ ఒక నాటకం ఆడింది. ఈ నాటకంలో తెలంగాణ ప్రజల పాత్ర లేదు. ఉన్నదంతా కాంగ్రెస్ నాయకులే.
అప్పటి రాజకీయ పరిదృశ్యంలో కాంగ్రెస్ కాకుండా ఇతర రాజకీయ పార్టీలను లేదంటే తెలంగాణ ప్రముఖులను లెక్కలోకి తీసుకోలేదు. కేవలం రెండువైపులా ఉన్న కాంగ్రెస్ నాయకులు చేసుకున్న ఒప్పందానికి గల సాధికారత, పవిత్రత ఏమిటని ప్రశ్నించుకోలేదు. కాంగ్రెస్ నాయకుల ఈ ధోరణి ఆ తర్వాత కాలంలో కూడా కొనసాగుతూ వచ్చింది. ఒంటెత్తు నిర్ణయం తీసుకోవాలనుకున్నపుడు కాంగ్రెస్ ఎవరినీ సంప్రదించదు. కానీ తప్పించుకోవాలనుకున్నపుడు మాత్రం తన అభిప్రాయం చెప్పకుండామిగతా వాళ్ల అభిప్రాయం అడిగి తప్పించుకుంటుంది. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల చేతకానితనానికి, తెలివితక్కువ తనానికి మొదటి అధ్యాయం ఈ పెద్దమనుషుల ఒప్పందం. కేంద్రంలోని కాంగ్రెస్ ద్రోహానికి, ఆధిపత్యానికీ ఇదే మొదలు. ఫజల్అలీ నేతృత్వంలోని రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ కమిటీ ప్రతిపాదనలకు భిన్నంగా తెలంగాణవారిని ఒప్పించడానికి నెహ్రూ, పంత్, మౌలానా ఆజాద్, థేబర్తో ఒక కమిటీని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. తెలంగాణను ఇంత బలవంతంగా ఆంధ్రతో కలిపేసిన చరిత్ర కాంగ్రెస్ అధినాయకత్వానిది.
పెద్దమనుషుల ఒప్పందం స్థూలంగా తేల్చేదేమిటి? తెలంగాణ రక్షణలు కోరే అధీన ప్రాంతంగా మారిపోవడం.. ఆ రక్షణలు ప్రసాదించే పాలిత వర్గంగా ఆంధ్ర ప్రాంతం ఎదిగి పోవడం.. ఎంత దీన స్థితి? కలుపుకోవాలని ఉబలాటపడుతూ ముంగిట సాగిలపడాల్సినవాడికి మనమే కిరీటం పెట్టి వాడి చేతికింది నీళ్లు తాగడానికి దిగజారడం. భూమ్మీద ఏ దేశంలోనూ ఏ ప్రాంతంలోనూ ఇంతటి దుర్మార్గం జరిగి ఉండదు. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ కాంగ్రెస్ పార్టీ.
చరిత్రలో దక్కన్, తెలంగాణ, హైదరాబాద్ పదాలు దాదాపు 15వ శతాబ్దం నుంచి ఏదో ఒక రకంగా తెలంగాణ అస్తిత్వంగా ఉన్నాయి. పెద్దమనుషుల ఒప్పందంలో భాగంగా తెలంగాణను ఆంధ్రతో విలీనంచేస్తే పెట్టబోయే పేరు గురించి తీర్మానం చేయలేదు. అయితే చర్చలో భాగంగా ‘ఆంధ్ర తెలంగాణ’ అనే పేరు ప్రతిపాదనకు వచ్చిందనీ, ఆ ప్రతిపాదన ఢిల్లీకి పంపించారనీ చెపుతారు. మరి తెలంగాణ పదం ఎప్పుడు ఎట్లా మాయమైంది? ఎవరు తెలంగాణ అస్తిత్వాన్ని మటుమాయం చేశారు? తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా కేంద్ర హోం మంత్రి జీబీ పంత్ ఎట్లా చెపితే అట్లా చేశారని అనిపిస్తుంది. మరి పంత్ ఎవరి లాబీయింగ్ ప్రభావంతో తెలంగాణ పదాన్ని మింగేశారో అర్థంకాని విషయం కాదు. ఏదేమైనా పెద్దమనుషుల ఒప్పందంతో మొదట మనం కోల్పోయింది మనపేరు. మళ్లీ 2014లో స్వరాష్ట్రం ఏర్పడే వరకు పేరులేని ప్రాంతంగా ఉండిపోయాం.
నాగార్జునసాగర్ జలాశయానికి శంకుస్థాపన చేసేందుకు 10 డిసెంబర్, 1955లో వచ్చిన ప్రధాని నెహ్రూకు బేగంపేట విమానాశ్రయం నుంచి దారి పొడుగునా ఎదురైన తెలంగాణవాదుల నల్లజెండాల నిరసనను కాంగ్రెస్ కేంద్రనాయకత్వం కనీసం పట్టించుకోలేదు. కాంగ్రెస్ కేంద్రనాయకత్వం పట్ల తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఉన్న భక్తి భావనను, లాయల్టీని తెలంగాణ ప్రజల మనోభీష్టం తగ్గించలేకపోయింది. ఇదే ధోరణి 1969 జై తెలంగాణ ఉద్యమ కాలంలోనూ, మలి దశ ఉద్యమంలోనూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు చూపించారు. తర్వాతి కాలంలో పార్టీ కేంద్ర నాయకత్వంతోపాటు ఆంధ్ర ముఖ్యమంత్రులపట్ల విధేయతను కూడా వీరభక్తితో ప్రదర్శించారు. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పుకొని ఆ తర్వాత బహిరంగంగా వ్యతిరేకించిన వైఎస్ రాజశేఖర్రెడ్డి గీచిన గీతను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు దాటలేదు.
తెలంగాణ కాంగ్రెస్ నాయకుల చేతకానితనానికి, తెలివితక్కువ తనానికి మొదటి అధ్యాయం ఈ పెద్దమనుషుల ఒప్పందం. కేంద్రంలోని కాంగ్రెస్ ద్రోహానికి, ఆధిపత్యానికీ ఇదే మొదలు. పెద్దమనుషుల ఒప్పందం.. కాంగ్రెస్ ఒప్పందం మాత్రమే పెద్దమనుషుల ఒప్పందం స్థూలంగా తేల్చేదేమిటి? తెలంగాణ రక్షణలు కోరే అధీన ప్రాంతంగా మారిపోవడం.. ఆ రక్షణలు ప్రసాదించే పాలిత వర్గంగా ఆంధ్ర ప్రాంతం ఎదిగి పోవడం.. ఎంత దీన స్థితి? కలుపుకోవాలని ఉబలాటపడుతూ ముంగిట సాగిలపడాల్సినవాడికి మనమే కిరీటం పెట్టి వాడి చేతికింది నీళ్లు తాగడానికి దిగజారడం. భూమ్మీద ఏ దేశంలోనూ ఏ ప్రాంతంలోనూ ఇంతటి దుర్మార్గం జరిగి ఉండదు. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ కాంగ్రెస్ పార్టీ. దాని అడుగులకు మడుగులొత్తిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు! తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఆంధ్ర సీఎం బెజవాడ గోపాలరెడ్డి, డిఫ్యూటీ సీఎం నీలం సంజీవరెడ్డి, మంత్రులు గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణరాజు ఇచ్చిన హామీలను పెద్దమనుషుల ఒప్పందం అని ముద్దుగా పేరుపెట్టుకున్నారు. తెలంగాణ నుంచి కూడా కాంగ్రెస్ నాయకులే ఈ ఒప్పందంలో పెద్దమనుషులు. నాటి హైదరాబాద్ సీఎం బూర్గుల రామకృష్ణారావు మెడలు వంచి కేంద్రం ఈ ఒప్పందానికి ఒప్పించింది. విశాలాంధ్రను వ్యతిరేకించిన కేవీ రంగారెడ్డి, జేవీ నర్సింగరావు, మర్రి చెన్నారెడ్డిని క్రమంగా మెత్తబరిచింది. అందుకే తెలంగాణ కాంగ్రెస్ వాళ్లు, ఆంధ్ర కాంగ్రెస్ వాళ్లు చేసుకున్న ఈ ఒప్పందం ఒక ఫార్సు మాత్రమే.
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎంత అసమర్థులంటే.. పెద్దమనుషుల ఒప్పందంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ 1962 వరకు కొనసాగాలి. కానీ అది కూడా నిలుపుకోలేనంత ’సమర్థులు’. పెద్దమనుషుల ఒప్పందంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు రావాల్సిన ఉప ముఖ్యమంత్రి లేక ముఖ్యమంత్రి పదవితో సహా ఏ ఒక్క అంశాన్నీ సాధించుకోలేనివాళ్లే ఆ తర్వాత 58 ఏండ్ల పరాధీనతకు జవాబుదారీ అవుతారు. తెలంగాణ ప్రాంతీయ మండలి అనే ఒక చట్టబద్ధ సంస్థకు బదులుగా తెలంగాణ ప్రాంతీయ కమిటీ అనే నిర్ణయాధికారం లేని సంస్థను ఏర్పాటుచేసి తెలంగాణను గంపగుత్తగా ఆంధ్ర పాలకుల చేతిలో పెట్టింది వీరే. ఉప ముఖ్యమంత్రి పదవికి అర్హుడైన కేవీ రంగారెడ్డిని పక్కన పెట్టడంకోసం అసలు ఉప ముఖ్యమంత్రి పదవి ఆరో వేలు లాంటిదని, అధికారాన్ని తెలంగాణ నాయకుల చేతికి రాకుండానీలం సంజీవరెడ్డి చేసినా కిమ్మనలేదు. రంగారెడ్డి ఉప ముఖ్యమంత్రి అయితే దాంతోపాటు ప్రాంతీయ మండలి ఉంటే తెలంగాణ భూములపై, ఉద్యోగాలపై పట్టు కోల్పోతామని చేసిన కుట్రను అడ్డుకోలేదు. వారి మాటవినే అచ్యుతరెడ్డిని తెలంగాణ ప్రాంతీయ కమిటీ పేరుతో ఉత్సవ విగ్రహంగా నిలిపారు. ఇదే అచ్యుతరెడ్డి 1969లో జై తెలంగాణ ఉద్యమం మొదలుకాగానే తెలంగాణ రక్షణలకోసం ఇప్పుడే విద్యార్థులు ఉద్యమించాల్సిన సమయం రాలేదనీ, సీఎం బ్రహ్మానందరెడ్డి తెలంగాణ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పి ఉద్యమంపై నీళ్లుచల్లే ప్రయత్నం చేశారు.
1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో భాగమైన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, 9 డిసెంబర్ 2009 నాటి చిదంబరం ప్రకటన తర్వాత కూడా ఆంధ్ర నాయకులు చూపిన ధైర్యంలో పదోవంతు కూడాచూపలేదు. తెలంగాణ భవిష్యత్తు ఎప్పుడూ ఢిల్లీ కాంగ్రెస్ చేతిలో బందీగానే ఉన్నది. అది 1950ల్లో జీబీ పంత్, థేబర్ వంటి కేంద్ర కాంగ్రెస్ నాయకులూ కావచ్చు, మలిదశ ఉద్యమంలోప్రణబ్ ముఖర్జీ, దిగ్విజయ్సింగ్, గులాం నబీ ఆజాద్ కావచ్చు.. వీళ్ల దయా దాక్షిణ్యాలపైనే తెలంగాణ, ఎజెండాగా ఉండాలో లేదో నిర్ణయించడం జరిగింది. ఇదే తెలంగాణ చేసుకున్న పాపం. పెద్దమనుషులు 1956లోనూ ఉంటారు, ఇప్పటికీ ఉంటారు తెలంగాణపై పెత్తనం చెలాయించడానికి.
– ఎంఏ శ్రీనివాసన్, చరిత్ర పరిశోధకుడు