హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): విదేశీ ప్రతినిధులకు సీఎం రేవంత్ బుధవారం విందు ఇచ్చారు. హైదరాబాద్లోని కుతుబ్షాహీ టూంబ్స్ వద్ద ఇచ్చిన ఈ విందుకు అమెరికా, ఇరాన్, తురియే, యూఏఈ, యూకే, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు ఈ విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి సీఎం రేవంత్ సాదర స్వాగతం పలికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యమిస్తున్నామని, యువత భవిష్యత్తుకు, పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు.
అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో పారిశ్రామిక పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, రాష్ర్టాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని ఆయా దేశాలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, మంత్రులు దామోదర రాజనర్సింహ, శ్రీధర్బాబు, సీఎస్ శాంతికుమారి, హైదరాబాద్ రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్ స్నేహజ తదితరులు పాల్గొన్నారు.